నామినేషన్లకు మరో అవకాశం

ABN , First Publish Date - 2021-03-02T08:03:42+05:30 IST

గత ఏడాది మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేయ లేకపోయిన కొందరికి ఎస్‌ఈసీ మరో అవకాశం ఇచ్చింది.

నామినేషన్లకు మరో అవకాశం

తిరుపతిలోని ఆరు డివిజన్లలో దాఖలుకు ఈసీ అనుమతి


తిరుపతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేయ లేకపోయిన కొందరికి ఎస్‌ఈసీ మరో అవకాశం ఇచ్చింది. తిరుపతి నగరపాలక సంస్థలోని 2, 8, 10, 21, 41, 45 డివిజన్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల్లోపు నామినేషన్‌ వేయవచ్చని ఎస్‌ఈసీ ఉత్తర్వులి చ్చింది. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణలకు గడువుంది.2వ డివిజన్‌కు డి.విమల, 8వ డివిజన్‌కు ఆర్‌.సదాశివ, 10వ డివిజన్‌కు సీఎన్‌.శరవణ, 21వ డివిజన్‌కు ఎ.మునెమ్మ, 41వ డివిజన్‌కు జి.సూర్యకుమారి, 45వ డివిజన్‌కు ఎ.చంద్రమోహన్‌లకు ఈ అవకాశం దక్కింది.వీరిలో పదో డివిజన్‌కు సంబంధించి బీజేపీ అభ్యర్థి కాగా తక్కిన వాటికి గతంలో ఇబ్బందులుపడ్డ టీడీపీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. 


టీడీపీ నగర ప్రధాన కార్యదర్శికి నో ఛాన్స్‌

పదో డివిజన్‌కు నామినేషన్‌ వేసేందుకు వచ్చిన టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మన్నెం శ్రీనివాసులు ఆధారాలతో ఫిర్యాదు చేసినా అతడికి అవకాశం ఇవ్వలేదు.టీడీపీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు కావడం వల్లే ఆయన కు అవకాశం రాలేదని తెలుస్తోంది. అయితే టీడీపీ పేరుతో ఒక సెట్‌ నామినేషన్‌ సమర్పిం చిన అభ్యర్థి అధికార పార్టీ కనుసన్నల్లో ఉన్నట్టు సమాచారం. ఇదే డివిజన్‌కు బీజేపీ అభ్యర్థిగా సీఎన్‌ శరవణ నామినేషన్‌ వేసేందుకు వెళుతుం డగా వైసీపీ కార్యకర్తలు అతడిని కింద పడదోసి, నామినేషన్‌ పత్రాలతోపాటు మొబైల్‌ ఫోన్‌, ఏటీఎం లాక్కున్నారు. అక్కడున్న ఎస్పీకి శరవణ మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు అతడికి మళ్లీ అవకాశం వచ్చింది. 

41వ డివిజన్‌కు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వచ్చిన టీటీడీ ఉద్యోగుల సంఘ నేత వెంకటేష్‌ భార్య చంద్రికను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. నామినేషన్‌ పత్రాలను చింపి బయటకు పంపారు. అలాగే టీడీపీ అభ్యర్థి సూర్యకుమారి కూడా వేయలేకపోయా రు. ఇప్పుడు ఆమెకు మళ్లీ అవకాశం వచ్చినప్ప టికీ అందుబాటులో లేరని పార్టీ నాయకత్వం ఆందోళన చెందుతోంది. 

8వ డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యర్థి రుద్రకోటి సదాశివం నామినేషన్‌ వేసేందుకు వస్తుండగా పత్రాలతోపాటు ప్రపోజర్లను కూడా మాయం చేశారు. దీనిపై ఆయన ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తే తిరిగి అవకాశం వచ్చింది. అయితే మళ్లీ బెదిరింపులు రావడంతో ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

2,45, 21 డివిజన్లకు చెందిన అభ్యర్థుల ఫిర్యాదు మేరకు మళ్లీ అవకాశం వచ్చినప్పటికీ వీరిలో ఒకరు పత్తాలేకుండా పోయారని సమాచారం.మొత్తానికి టీడీపీకి ఐదుచోట్ల అవకాశాలొచ్చినా.. రెండు, మూడు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. 


మూడు వార్డుల్లో పుంగనూరు అభ్యర్థులకు అవకాశం

  పుంగనూరు,మార్చి 1:పుంగనూరు మున్సిపాలిటీలోని  మూడు వార్డుల్లో నామినేషన్‌ వేయలేకపోయిన అభ్యర్థులకు ఎన్నికల కమిషన్‌ మరో అవకాశం కల్పించింది. 9,14,28 వార్డులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాక మంగళవారం నామినేషన్‌ వేయవచ్చని  ఉత్తర్వులిచ్చింది.9వ వార్డుకు ఎస్‌.మున్నీ, 14వ వార్డుకు సి.గీతమ్మ, 28వ వార్డుకు బి.చంద్రకళలకు మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల్లోపు నామినేషన్లు దాఖలు చేయొచ్చని సూచించింది. 

Updated Date - 2021-03-02T08:03:42+05:30 IST