తెలుగు తెరపైకి మరో కన్నడ కస్తూరి!
ABN , First Publish Date - 2021-03-21T05:56:46+05:30 IST
తెలుగు తెరపై కథానాయికలుగా రాణిస్తున్న కన్నడ అమ్మాయిలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. అనుష్క, రష్మిక, పూజా హెగ్డే, ప్రణీతా సుభాష్, కృతి శెట్టి...
తెలుగు తెరపై కథానాయికలుగా రాణిస్తున్న కన్నడ అమ్మాయిలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. అనుష్క, రష్మిక, పూజా హెగ్డే, ప్రణీతా సుభాష్, కృతి శెట్టి... వీళ్లందరూ కన్నడిగులే. ఈ జాబితాలో మరో అమ్మాయి చేరుతున్నారు. కన్నడ కస్తూరి మాన్వితా కామత్ ఓ తెలుగు సినిమాలో నటించే అవకాశం దక్కింది. సుమంత్ హీరోగా శుక్రవారం ‘మళ్లీ మొదలైంది’ అని కొత్త సినిమా ప్రారంభమైంది. అందులో మాన్విత కథానాయిక. టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.