మరో ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు.. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా..
ABN , First Publish Date - 2022-05-01T03:18:12+05:30 IST
చెన్నై: తమిళనాడులోని హొసూర్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తుండగా స్కూటర్ సీటు కింద నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి.
చెన్నై: తమిళనాడులోని హొసూర్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తుండగా స్కూటర్ సీటు కింద నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో స్కూటర్ వెనుక భాగం దాదాపు కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు రావడాన్ని గుర్తించిన యజమాని సతీష్ కుమార్ వేగంగా స్పందించి తప్పించుకోగలిగాడు. మంటలు గుర్తించిన వెంటనే స్కూటర్ను ఆపివేసి పక్కకు పరిగెత్తాడు. దీంతో ఎలాంటి హానికలగకుండానే బయటపడ్డాడు. రోడ్డుపై వెళ్తున్నవారు మంటలను ఆర్పేందుకు సాయం చేసినా ఫలితం దక్కలేదు. స్కూటర్ వెనుక లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. గతేడాది ఈ స్కూటర్ను కొనుగోలు చేశానని సతీష్ చెప్పాడు.
కాగా ఇటివల ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. మార్చి నెలలో తమిళనాడులోని వెల్లూర్ జిల్లాలో ఇదే తరహా విషాద ఘటన జరిగింది. ఛార్జింగ్ పెడుతున్న సమయంలో స్కూటర్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు చనిపోయారు. తిరుచిరప్పలి జిల్లాలో కూడా ఇదే తరహా మరో ఘటన జరిగింది. మరోవైపు తెలంగాణలోనూ ఇటివల ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.