భారత్కు మరో డ్రా
ABN , First Publish Date - 2022-07-06T10:07:22+05:30 IST
మహిళల హాకీ వరల్డ్క్పలో భారత్.. మరో మ్యాచ్ను డ్రా చేసుకొంది. మంగళ వారం పూల్-బిలో చైనాతో జరిగిన మ్యాచ్ను భారత్ 1-1తో ముగించింది.
చైనాతో పోరు 1-1తో సమం
మహిళల హాకీ వరల్డ్ కప్
అమ్స్టెల్వీన్: మహిళల హాకీ వరల్డ్క్పలో భారత్.. మరో మ్యాచ్ను డ్రా చేసుకొంది. మంగళ వారం పూల్-బిలో చైనాతో జరిగిన మ్యాచ్ను భారత్ 1-1తో ముగించింది. భారత్ తరఫున ఏకైక గోల్ను వందనకా కటారియా 45వ నిమిషంలో చేసింది. అంతకుముందు చైనా క్రీడాకారిణి జియాలి జంగ్ 26వ నిమిషంలో గోల్ కొట్టింది. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్తో పోరును కూడా భారత్ 1-1తో డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. గురువారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో టీమిండియా తలపడనుంది.