కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మరో కరోనా పాజిటివ్ కేసు

ABN , First Publish Date - 2020-04-05T01:14:51+05:30 IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జగయ్యపేటలో కరోనా పాజిటివ్‌ కేసులు మూడుకు చేరింది. ఢిల్లీ వెళ్లొచ్చిన ఆరుగురిలో ముగ్గురికి పాజిటివ్‌గా తీలింది.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మరో కరోనా పాజిటివ్ కేసు

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జగయ్యపేటలో కరోనా పాజిటివ్‌ కేసులు మూడుకు చేరింది. ఢిల్లీ వెళ్లొచ్చిన ఆరుగురిలో ముగ్గురికి పాజిటివ్‌గా తీలింది. కరోనా బాధితుల కుటుంబ సభ్యుల్ని అధికారులు క్వారంటైన్‌కి తరలించారు. 


మరోవైపు మచిలీపట్నంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. చిలకలపూడికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటీవ్‌గా అధికారులు నిర్ధారించారు. పాజిటివ్‌గా తేలడంతో నగరమంతా కర్ఫ్యూ విధించారు. బాధితుడి కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. మచిలీపట్నంలోని 4, 5, 6, 7, 8, 9 డివిజన్లతో పాటు బందరు మండలం నవీన్ మిట్టల్ కాలనీని రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2020-04-05T01:14:51+05:30 IST