భూ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్పై మరో కేసు
ABN , First Publish Date - 2021-12-22T02:06:43+05:30 IST
జిల్లా భూ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్
సంగారెడ్డి: జిల్లా భూ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూధన్పై మరో కేసు నమోదయింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ కేసు నమోదు చేసింది. గతంలో లంచం కేసులో మధుసూధన్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా మధుసూధన్ ఇల్లు, బంధువుల ఇళ్ల పై ఏసీబీ సోదాలు నిర్వహించింది. కోటి మూడు లక్షల నగదు తో పాటు 314 గ్రాములు బంగారం 95 లక్షల పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్లో మధుసూధన్ ఉన్నారు.