ఆర్టీసీ బస్సును ఢీకొన్న మరో బస్సు

ABN , First Publish Date - 2022-05-18T05:43:36+05:30 IST

ఆర్టీసీ బస్సును ఢీకొన్న మరో బస్సు

ఆర్టీసీ బస్సును ఢీకొన్న మరో బస్సు

చేవెళ్ల, మే 17: మెహదీపట్నం నుంచి శంకర్‌పల్లికి వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఒకదాని వెనుకల మరొకటి వస్తున్నాయి. మండలంలోని మోకిల గ్రామ స్టేజీ వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న బస్సు డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వెనుకాల నుంచి వస్తున్న మరో బస్సు ఽఢీ కొట్టింది. దీంతో వెనుక నుంచి వచ్చిన బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్‌పల్లి ఎస్‌ఐ సంతో్‌షరెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-05-18T05:43:36+05:30 IST