70 ఏళ్ల దాకా బతకలేను అంటూ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్య!

ABN , First Publish Date - 2020-08-16T04:44:20+05:30 IST

నాకు 70 ఏళ్లు వచ్చే దాకా బతకడం ఇష్టం లేదంటూ ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

70 ఏళ్ల దాకా బతకలేను అంటూ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్య!

న్యూఢిల్లీ: నాకు 70 ఏళ్లు వచ్చే దాకా బతకడం ఇష్టం లేదంటూ ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడిని మోహిత్ సింఘ్లాగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆయన పీడియాట్రిక్స్ శాఖలో పనిచేస్తున్నారని తెలిపారు. సింఘ్లా ఇంట్లోంచి దుర్వాసన వస్తోందంటూ ఇరుగుపొరుగు వారు పోలీసులకు శుక్రవారం నాడు సమాచారం అందించడంతో ఈ విషయం బయటపడింది. అతడు మృతి చెంది రెండు రోజులకు పైగానే అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ‘ఇది నా జీవితం. నా నిర్ణయం. నాకు 60-70 ఏళ్లు వచ్చే వరకూ జీవించడం ఇష్టం లేదు’ అని డాక్టర్ తన సూసైడ్ నోట్‌లో రాసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ‘నా మానసిక స్థితిని దాచుకోలేకపోయాను’ అని కూడా మోహిత్ రాశారని వారు తెలిపారు. అయితే ఈ ఘటనలో నేర కోణం లేదని తాము ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు చెప్పారు. కాగా.. ఇటీవల కాలంలో ఎయిమ్స్ ఆస్పత్రిలో మరో ఇద్దరు వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో  ఎయిమ్స్ వైద్యులు కొందరు ఈ వారం మొదట్లో.. అక్కడి పనివాతావరణం యువవైద్యులను ఉత్సాపరిచేదిగా ఉండాలంటూ డైరెక్టర్‌కు లేఖ రాశారు.

Updated Date - 2020-08-16T04:44:20+05:30 IST