విశాఖలో మరో ప్రమాదం.. వరుస ప్రమాదాలతో వణికిపోతున్న ప్రజలు

ABN , First Publish Date - 2020-08-09T21:47:08+05:30 IST

వరుస ప్రమాదాలతో విశాఖ వణికిపోతోంది. తాజాగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నౌకలో మరో అగ్నిప్రమాదం జరిగింది. వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్‌లో నౌకలో ఇంజన్ రూమ్ నుంచి మంటలు వ్యాపించాయి.

విశాఖలో మరో ప్రమాదం.. వరుస ప్రమాదాలతో వణికిపోతున్న ప్రజలు

విశాఖ: వరుస ప్రమాదాలతో విశాఖ వణికిపోతోంది. తాజాగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నౌకలో మరో అగ్నిప్రమాదం జరిగింది. వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్‌లో నౌకలో ఇంజన్ రూమ్ నుంచి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కోర్టు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇంజన్ రూమ్‌లో కావడంతో గ్యాస్ మాస్కు ధరించి సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోర్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. శనివారం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వెంటనే మంటలను గుర్తించిన మత్స్యకారులు పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు కిందకు దూకి ఒడ్డు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూ.50 లక్షలు నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలిసింది. హార్బర్‌లో ఓ బోటు ఇవాళ చేపల వేటకు వెళ్లింది. చేపల వేట తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.

Updated Date - 2020-08-09T21:47:08+05:30 IST