మరో 8 పాజిటివ్ కేసుల నమోదు
ABN , First Publish Date - 2020-05-23T09:34:18+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం జిల్లాలో మరో 8 పాజిటివ్ కేసులు
నెల్లూరు(వైద్యం) మే 22 : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం జిల్లాలో మరో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో నెల్లూరులోని కోటమిట్ట ప్రాంతంలో 5 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఢిల్లీ మర్కజ్ కాంట్రాక్టుకు సంబంధించినవేనని అధికారులు భావిస్తున్నారు. ఇక వింజమూరు మండలంలో మరో రెండు, సూళ్లూరుపేటలో ఒక కేసు నమోదయింది. దీంతో జిల్లావ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 209కి చేరుకుంది.