ఏపీలో మరో 4 ఒమైక్రాన్ కేసులు
ABN , First Publish Date - 2022-01-05T23:49:12+05:30 IST
రాష్ట్రంలో కరోనా వేరియెంట్ ఒమైక్రాన్ వేగంగా
అమరావతి: రాష్ట్రంలో కరోనా వేరియెంట్ ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏపీలో కొత్తగా మరో 4 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 3, గుంటూరులో ఒక కేసు నమోదయింది. దీంతో ఏపీలో మొత్తం 28కి ఒమైక్రాన్ కేసులు చేరాయి. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించాలన్నారు.