మరో 305 పాజిటిక్ కేసులు
ABN , First Publish Date - 2020-09-24T06:47:04+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం కొత్తగా 305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
కొత్తగూడెం కలెక్టరేట్, సెప్టెంబర్ 23: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం కొత్తగా 305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 69కేసులు నమోదవ్వగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 236 కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో మొత్తం 2,432 పరీక్షలు నిర్వహించగా 236 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.