కొత్తగా 294 పాజిటివ్లు
ABN , First Publish Date - 2021-04-22T06:20:37+05:30 IST
జిల్లాలోబుధవారం కొత్తగా 294 కరోనా పాజిటివ్లు నమోదయ్యాయి.
ఒంగోలులో 56 కేసులు
ఒంగోలు (కార్పొరేషన్/కలెక్టరేట్), ఏప్రిల్ 21 : జిల్లాలోబుధవారం కొత్తగా 294 కరోనా పాజిటివ్లు నమోదయ్యాయి. అత్యధికంగా ఒంగోలులో 56మందికి వైరస్ సోకింది. శింగరాయకొండ 39, దర్శి లో 28, పర్చూరులో 20, టంగుటూరులో 17, మార్కాపురంలో 14 మంది కొవిడ్ బారినపడ్డారు. ఒంగోలు రూరల్లో 8, దోర్నాల 8, కొత్తపట్నం 8, తాళ్లూరులో 8 కేసులు నమోదయ్యాయి. వారితోపాటు బల్లికురవ, ఉలవపాడు, కొనకనమిట్ల, కారంచేడు, వేటపాలెం, కందుకూరు పెదారవీడు, త్రిపురాంతకం, చీరాల, సీఎస్పురం, కంభం, దొనకొండ, అద్దంకి ప్రాంతాల్లో పలువురుకి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో బుధవారం 125 కేంద్రాల్లో 1914 మందికి టీకా వేశారు.