ఏపీకి మరో 2.65 లక్షల డోసులు: కేంద్రం
ABN , First Publish Date - 2021-05-06T09:17:33+05:30 IST
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలకు అదనంగా 36,37,030 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ బుధవారం వెల్లడించింది
న్యూఢిల్లీ, మే 5(ఆంధ్రజ్యోతి): రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలకు అదనంగా 36,37,030 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ బుధవారం వెల్లడించింది. వాటిలో ఆంధ్రప్రదేశ్కు 2,65,360డోసులు, తెలంగాణకు 50వేలడోసులు కేటాయించినట్లు పేర్కొంది.