మరో 103 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-07-25T05:34:48+05:30 IST
జిల్లాలో శనివారం కొత్తగా 103 కరోనా కేసులు నమోదయ్యాయి.
విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం కొత్తగా 103 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,52,198కు చేరింది. ఇందులో 1,49,260 మంది కోలుకున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందడంతో కొవిడ్ మరణాల సంఖ్య 1046కు చేరింది.
ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు: శనివారం ఒక్కరోజే ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకూ 352 మందికి బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయినట్టయ్యింది. ఇందులో 240 మంది కోలుకోగా, 32 మంది మృతిచెందారు. కొందరు చికిత్స పొందుతున్నారు.