విద్యాధరి క్షేత్రంలో వైభవంగా వార్షికోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2021-02-26T05:48:26+05:30 IST

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్‌ మండలకేంద్రంలోని శంభుగిరి కొండపై వెలసిన విద్యాధరి క్షేత్రంలో 29వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేడుకలకు అంకురార్పణ చేశారు.

విద్యాధరి క్షేత్రంలో వైభవంగా వార్షికోత్సవ వేడుకలు

వర్గల్‌, ఫిబ్రవరి 25 : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్‌ మండలకేంద్రంలోని శంభుగిరి కొండపై వెలసిన విద్యాధరి క్షేత్రంలో 29వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేడుకలకు అంకురార్పణ చేశారు. అనంతరం విద్యాసరస్వతీ అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో చండీహోమం, లలితాపారాయణం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చంద్రశేఖరశర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో ఆలయం వద్ద ఉన్న శ్రీ శారదా స్మార్త వేద పాఠశాలలో వేదం అభ్యసించేందుకు గాను ప్రవేశానికి వచ్చిన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వేద పండితులు అనంతగిరిశర్మ, శశిధరశర్మ, నాగరాజుశర్మతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-26T05:48:26+05:30 IST