రత్నగిరి రామయ్య పెండ్లి కొడుకాయనే
ABN , First Publish Date - 2021-04-21T05:46:15+05:30 IST
సత్యదేవుని ఆలయ క్షేత్ర పాలకులైన సీతారాముల దివ్య కల్యాణ మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
అన్నవరం, ఏప్రిల్ 20: సత్యదేవుని ఆలయ క్షేత్ర పాలకులైన సీతారాముల దివ్య కల్యాణ మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక వేదికపై సీతారాములను, మరో వేదికపై పెండ్లి పెద్దలైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను ఆశీనులు గావించి ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం అనంతరం ఉల్లూకుల గౌరీపూజ నిర్వహించారు. సీతారాముల నుదుట తిలకం, బుగ్గన చుక్కతో అలంకరించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ ఏడాది రాములవారి కల్యాణాన్ని భక్తులు లేకుండా ఏకాంతంగా నిర్వహించనున్నట్టు ఈవో త్రినాథరావు చెప్పారు.