శ్రీవారి కల్యాణానికి అన్నవరం నుంచి పట్టువస్త్రాలు
ABN , First Publish Date - 2022-05-16T05:45:18+05:30 IST
శ్రీవారి కల్యాణానికి అన్నవరం నుంచి పట్టువస్త్రాలు
ద్వారకాతిరుమల, మే 15: స్వామి దివ్య కల్యాణ మహోత్సవానికి అన్నవరం దేవస్థానం నుంచి ఆదివారం పట్టువస్త్రాలు అందాయి. అన్నవరం దేవస్థానం చైర్మన్ ఇనుగంటి వేంకట రోహిత్ ముందుగా ఆలయానికి వచ్చి అక్కడ నుంచి పట్టువస్త్రాలు శిరస్సుపై పెట్టుకుని, ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం వీటిని ఆలయ ఈఓ త్రినాథరావుకు అందించారు. అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు ఆయనకు స్వామి మెమొరంటోను, ప్రసాదాలను అందజేశారు. అనంతరం చినవెంకన్న ఆలయ చైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావును వేంకట రోహిత్ మర్యాదపూర్వకంగా కలిశారు.