అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ కామిశెట్టి మృతి

ABN , First Publish Date - 2020-09-20T09:29:28+05:30 IST

అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ కామిశెట్టి మృతి

అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ కామిశెట్టి మృతి

తిరుపతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు వ్యవస్థాపక డైరెక్టర్‌ కామిశెట్టి శ్రీనివాసులు శనివారం మృతి చెందారు. కిడ్నీ సమస్యతో హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో ఆయన కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలోనే ఆయనకు కొవిడ్‌ సోకింది. కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో వైద్యు లు తిరిగి కిడ్నీ చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మృతి చెందారు.

Updated Date - 2020-09-20T09:29:28+05:30 IST