అన్ని మతాలను సమానంగా చూడాలి: అన్నం వెంకటరమణారెడ్డి

ABN , First Publish Date - 2021-01-15T23:11:21+05:30 IST

జగన్నాధుడికే పంగనామాలు పెట్టగల సమర్థుడు సీఎం జగన్ అని టీడీపీ నేత అన్నం వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు.

అన్ని మతాలను సమానంగా చూడాలి: అన్నం వెంకటరమణారెడ్డి

విజయవాడ: ప్రభుత్వం ఏకపక్ష ధోరణి మాని, అన్ని మతాలను సమానంగా చూడాలని అన్నం వెంకటరమణారెడ్డి అన్నారు.  శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్నాథుడికే పంగనామాలు పెట్టగల సమర్థుడు  సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్  తను చేసిన తప్పులు తెలియకుండా ఉండేందుకు గోపూజ డ్రామాలు  ఆడుతున్నాడన్నారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని  పట్టుకోవడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-01-15T23:11:21+05:30 IST