అన్న క్యాంటీన్‌కు అపూర్వ స్పందన

ABN , First Publish Date - 2022-07-02T06:05:14+05:30 IST

అన్న క్యాంటీన్‌కు అపూర్వ స్పందన

అన్న క్యాంటీన్‌కు అపూర్వ స్పందన

ప్రభుత్వాసుపత్రి, జూలై 1 : అన్నమో రామచంద్రా.. అన్నవారికి రూ.5కే కడుపునిండా భోజనం పెట్టి ఆదుకునేవి అన్న క్యాంటీన్లు. టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన వీటివల్ల పేదలు, కూలీలు, రోజువారీ పనివాళ్లు పస్తులు లేకుండా పొట్ట నింపుకొనేవారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదల పొట్టకొట్టింది. పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తొలగించింది. కానీ, పేదల మనసుల్లో స్థానాన్ని మాత్రం తొలగించలేకపోయింది. అందుకు నిదర్శనమే.. కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద శుక్రవారం జరిగిన మొబైన్‌ అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆదరణ. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 300 మంది పేదలు పాల్గొని కడుపునిండా భోజనం చేశారు.



Updated Date - 2022-07-02T06:05:14+05:30 IST