కనుల పండువగా ఆంజనేయస్వామి గ్రామోత్సవం
ABN , First Publish Date - 2022-05-27T03:12:56+05:30 IST
పట్టణ ముసునూరు ట్రంకురోడ్డు వద్ద నున్న హనుమత్ క్షేత్రంలో గురువారం ఆంజనే యస్వామి గ్రామోత్సవం కనుల పండువగా జరి
కావలిటౌన్, మే26: పట్టణ ముసునూరు ట్రంకురోడ్డు వద్ద నున్న హనుమత్ క్షేత్రంలో గురువారం ఆంజనే యస్వామి గ్రామోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక అర్చకులు వేదగిరి సూర్చనా రాయణాచార్యులు పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఉదయం అభిషేకాలు, నిత్యహోమం, పంచముఖ హనుమత్ గాయత్రి హోమం తదితర ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం పూర్ణాహుతి, నిత్యహోమం పూజల అనంతరం రాత్రి మంగళవాయిద్యాలతో పెద్దఎత్తున బాణ సంచాల నడుమ గ్రామోత్సవం జరిగింది.