దళితులపై వైసీపీ సవితి తల్లిప్రేమ

ABN , First Publish Date - 2020-06-04T08:55:04+05:30 IST

దళితులపై వైసీపీ ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు..

దళితులపై వైసీపీ సవితి తల్లిప్రేమ

టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు


గుంటూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): దళితులపై వైసీపీ ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపుతోందని  టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సీఎం జగన్‌పాలనలో ఏపీ దక్షిణాది బీహార్‌ తయారువుతోంది.. మరీ ముఖ్యంగా దళితుల హక్కులను కాలరాసేవిధంగా రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందని మండి పడ్డారు. అందుకు దళిత సమాజానికి చెందిన డాక్టర్‌, మాజీ ఎంపీ, మాజీమంత్రులపై ఇటీవల జరిగిన దాడులే నిదర్శనమన్నారు.


ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌  ప్రేమానందం విషయంలో వీసీ, రిజస్ట్రార్‌ లు వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. దాడి ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. వైసీపీ ప్రభుత్వం వీసీ, రిజిస్ట్రార్‌లకు ఒత్తాసు పలకటం దారుణమన్నారు. ప్రొఫెసర్‌  ప్రేమానందం విషయంలోబాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టుచేయాలని, వీసీనీ సస్పెండ్‌ చేయాలని జీవీ  డిమాండ్‌చేశారు. 

Updated Date - 2020-06-04T08:55:04+05:30 IST