ఆంజనేయస్వామి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-05-16T05:04:46+05:30 IST

ఆంజనేయస్వామి దయతో ప్రజలందరూ సుఖ: సంతోషాలతో ఉండాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ ఆకాక్షించారు.

ఆంజనేయస్వామి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి
పెద్దకోడూరులో ధ్వజ స్తంభానికి పూజలు చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

చిన్నకోడూరు, మే 15: ఆంజనేయస్వామి దయతో ప్రజలందరూ సుఖ: సంతోషాలతో ఉండాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ ఆకాక్షించారు. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులోని శివాంజనేయస్వామి ఆలయం పునరుద్ధరణలో భాగంగా శివ పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, నవగ్రహలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉత్సవాల్లో ఆదివారం ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లోని ఆలయాల్లో పూజ చేసే అర్చకులకు దూప, దీప నైవేద్యాల కింద వేతనాలు ఇస్తున్నదన్నారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ దంపతులను, ఎంపీపీ మాణిక్యరెడ్డి దంపతులను, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, బీసీ కమిటీ మండల ప్రధాన కార్యదర్శి దుర్గాచారి, సర్పంచ్‌ లింగం, ఎంపీటీసీ సాయి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T05:04:46+05:30 IST