నెల్లూరు జిల్లాలో కాకరేపుతున్న అనిత వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-07T16:52:00+05:30 IST

పోలీసులపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత చేసిన ఆరోపణలు నెల్లూరు జిల్లాలో కాకరేపుతున్నాయి.

నెల్లూరు జిల్లాలో కాకరేపుతున్న అనిత వ్యాఖ్యలు

అమరావతి: పోలీసులపై  తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత చేసిన ఆరోపణలు నెల్లూరు జిల్లాలో కాకరేపుతున్నాయి. మహిళలపట్ల దాష్టికాలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ చదివే పాసయ్యారా? అంటూ ఘాటు విమర్శలు చేశారు. నెల్లూరులో జరిగిన నారీ సంకల్ప దీక్షలో అనిత.. సీఎం జగన్, హోం మంత్రితో పాటు జిల్లా ఎస్పీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దిశ చట్టం వల్ల ముగ్గురికి ఉరి శిక్ష పడిందని చెప్పుకునే పెద్ద మనిషి.. ప్రస్తుతం ఆ దిశ చట్టమే లేదని చెప్పుకునే పరిస్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కంటే తమ ప్రభుత్వంలో పనిచేసిన కానిస్టేబుల్, హోంగార్డు నిజాయితీగా పని చేశారని అనిత వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-07T16:52:00+05:30 IST