AP: ఇదేమి నియంత పాలన..: అనిత

ABN , First Publish Date - 2021-11-08T20:47:43+05:30 IST

అనంతపురంలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం దుర్మార్గమని టీడీపీ నాయకురాలు అనిత విమర్శించారు.

AP: ఇదేమి నియంత పాలన..: అనిత

విశాఖ: అనంతపురంలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం దుర్మార్గమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘జగన్ రెడ్డి మీ తప్పులను ఎత్తి చూపి న్యాయం చేయమంటే దౌర్జన్యం చేస్తారా..? ఇదేమి నియంత పాలన.. మొన్న దళితులు, నిన్న మహిళలు, నేడు మీ కన్ను విద్యార్థుల మీద పడిందా?’’ అంటూ విమర్శలు గుప్పించారు. తమ కాలేజీ కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై ఖాకీలను ఊసుగొల్పి రక్తం వచ్చేలా కొట్టిస్తారా? అంటూ మండిపడ్డారు.


గాయపడిన విద్యార్థులకు సత్వరమే మెరుగైన చికిత్స అందించాలని అనిత డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులను కఠినంగా శిక్షించాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుందని అనిత స్పష్టం చేశారు.

Updated Date - 2021-11-08T20:47:43+05:30 IST