కోళ్లు.. చేపలకు దాణాగా జంతు అవయవాలు

ABN , First Publish Date - 2022-05-19T14:30:18+05:30 IST

అనుమతులు లేని 12 స్టోరేజీలను సీజ్‌ చేశారు. జంతు అవయవాలను ఎండబెట్టి కోళ్లు..

కోళ్లు.. చేపలకు దాణాగా జంతు అవయవాలు

  • 12 కోల్డ్‌ స్టోరేజీలను సీజ్‌ చేసిన అధికారులు


హైదరాబాద్ సిటీ/పహాడీషరీఫ్‌ : జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధి షాజహాన్‌ కాలనీ సర్వర్‌ బాబా నగర్‌లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న కోల్డ్‌ స్టోరేజ్‌లపై జల్‌పల్లి మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది బాలాపూర్‌ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని 12 స్టోరేజీలను సీజ్‌ చేశారు. జంతు అవయవాలను ఎండబెట్టి కోళ్లు, చేపల దాణా కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన మాంసాన్ని, అనుమతి లేకుండా అమ్మోనియా గ్యాస్‌, విద్యుత్‌ కూడా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పశు మాంసం, వివిధ అవయవాలను చైనా, బంగ్లాదేశ్‌, యూఏఈ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. 12 కోల్డ్‌ స్టోరేజీలను సీజ్‌ చేసిన మున్సిపల్‌ కమిషనర్‌ జీపీ కుమార్‌,  పలు కంపెనీల మేనేజర్లను బాలాపూర్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2022-05-19T14:30:18+05:30 IST