గడ్డి కోసం వెళ్లిన వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-03-07T06:50:02+05:30 IST
రెండురోజుల క్రితం పశువులకు పచ్చగడ్డి కొనేందుకు వెళ్లిన వ్యక్తి కాలువలో శవమై తేలాడు.
తాళ్లరేవు, మార్చి 6: రెండురోజుల క్రితం పశువులకు పచ్చగడ్డి కొనేందుకు వెళ్లిన వ్యక్తి కాలువలో శవమై తేలాడు. కోరింగ పోలీసుల వివరాల ప్రకారం చొల్లంగిపేట గ్రామానికి చెందిన మందాల బయ్యన్న(65) పశువులకు పచ్చ గడ్డి కొనేందుకు వెళ్లి బుధవారం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం మట్లపాలెం కాలువలో మృతదేహం లభ్యమైంది. కోరింగ ఎస్ఐ వై.సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.