ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ.. కారణమేంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-05-02T18:42:36+05:30 IST

ఆ మహిళకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది.. పువ్వుల్లో పెట్టి చూసుకునే భర్త.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్న సంసారంలో చిన్న వివాదం కలతలు రేపింది..

ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ.. కారణమేంటో తెలిస్తే షాక్!

ఆ మహిళకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది.. పువ్వుల్లో పెట్టి చూసుకునే భర్త.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్న సంసారంలో చిన్న వివాదం కలతలు రేపింది.. బలహీన క్షణంలో ఆ మహిళ తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపింది.. భర్త ఓ పెళ్లికి వెళ్లొద్దన్నాడని చెప్పి ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది..  గుజరాత్‌లోని సూరత్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. 


సూరత్‌కు సమీపంలోని సోథియా గ్రామానికి చెందిన ఒక జంట ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఎనిమిదేళ్లు ఎలాంటి కలతలు లేకుండా సాఫీగా కలిసి జీవించారు. అయితే ఓ వివాహం ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణమైంది. తన పుట్టింటికి సంబంధించిన బంధువుల పెళ్లికి వెళ్తానని భర్తను ఆ మహిళ కోరింది. అందుకు తనకు డబ్బులు ఇవ్వాలని అడిగింది. అయితే, భార్య ఆ పెళ్లికి వెళ్లడానికి భర్త అంగీకరించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. 


తీవ్ర ఆగ్రహానికి గురై విచక్షణను కోల్పోయిన మహిళ దగ్గరలో ఉన్న గోండా గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్‌కు తన పిల్లలతో పాటు చేరుకుంది. వేగంగా వస్తున్న రైలు ముందు పిల్లలతో పాటు కలిసి దూకేసింది. భార్య కనిపించకపోవడంతో భర్త, అత్తింటి వారు వెతకడం ప్రారంభించారు. కాసేపటికి పిల్లలను, భార్యను విగత జీవులుగా చూసి భర్త కన్నీటి పర్యంత మయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2022-05-02T18:42:36+05:30 IST