ఆయుర్వేద మందు నిలిపివేతపై ఆగ్రహం

ABN , First Publish Date - 2021-05-18T05:11:36+05:30 IST

కరోనా మహమ్మారి కట్టడికి ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఉచితంగా చేస్తున్న ఆయుర్వేద మందు పంపిణీని అధికారులు నిలిపివేయడంతో తీరప్రాంత మండలాల ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహిస్తున్నారు

ఆయుర్వేద మందు నిలిపివేతపై ఆగ్రహం

చిట్టమూరు, మే 17 :  కరోనా మహమ్మారి కట్టడికి ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఉచితంగా చేస్తున్న ఆయుర్వేద మందు పంపిణీని అధికారులు నిలిపివేయడంతో తీరప్రాంత మండలాల ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహిస్తున్నారు. కరోనాతో ఆప్తులను కోల్పోయి, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేరే ఆర్థిక స్తోమత లేక, ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు దొరకక, ఆక్సిజన్‌ లేక ఇబ్బంది పడుతున్న బాధితులకు కృష్ణపట్నం గ్రామంలో ఆయుర్వేదిక్‌ వైద్యుడు ఆనందరావు ఉచితంగా కరోనా వైరస్‌కు చెక్‌పెట్టేందుకు పంపిణీ చేస్తున్న మందుపై నమ్మకం కలిగింది. ఆయన ఏడాది నుంచి ప్రయోగాలు చేసి మందు తయారు చేశారనీ, ఎంతో మంది ఆక్సి.జన్‌ పెట్టుకొని వచ్చిన వారికి బొట్టు మందుతో కరోనాను కట్టడి చేసి పంపించారని తెలిపారు. కరోనా కట్టడికి పనిచేసే మందును అధికారులు అడ్డుకొని ప్రజలకు అన్యాయం చేశారని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ మందు పంపిణీకి గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-18T05:11:36+05:30 IST