జీవో 172ను ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2021-06-11T04:54:40+05:30 IST
ఐసీడీఎస్ లక్ష్యానికి విరుద్ధంగా రాష్ట్రం లో నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి తీసుకొచ్చిన జీవో 172ను వెంటనే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
గణపవరంలో అంగన్వాడీ కార్యకర్తల నిరసన
గణపవరం (నిడమర్రు) జూన్ 10:ఐసీడీఎస్ లక్ష్యానికి విరుద్ధంగా రాష్ట్రం లో నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి తీసుకొచ్చిన జీవో 172ను వెంటనే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. గణపవరం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు గురువారం నిరసన తెలిపారు. కొవిడ్ వల్ల చనిపోయిన వారికి రూ. 50 లక్షల బీమా నష్ట ్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐసీడీఎస్ పాజెక్టు అధికా రిణి పద్మావతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కె.ఝాన్సీ. ఎం.డి. హీరాబాయి, సీహెచ్.సీతామహాలక్ష్మి, బి.రామకోటి, బి.రాజేశ్వరి పాల్గొన్నారు.