ఏపీలో న్యాయం కోసం నినదించడమే తప్పా?.
ABN , First Publish Date - 2021-07-23T01:29:26+05:30 IST
ఏపీలో న్యాయం కోసం నినదించడమే తప్పా?.
అమరావతి: తాడేపల్లిలో శివశ్రీ అనే యువతి ఇల్లును అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వెనుకున్న అమరారెడ్డి నగర్లో 321 కుటుంబాలు నివాసముంటున్నాయి. సీఎం జగన్ భద్రత దృష్ట్యా ఈ ఇళ్లను తొలగించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 277 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేశారు. అయితే స్థలాలు ఇచ్చే విషయంలో సరైన న్యాయం జరగలేడంలేదని, నిరాశ్రయులకు పరిహారం చెల్లించాలని శివశ్రీ పోరాడారు. అయితే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఆమె కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో శివశ్రీ ఇల్లును బుధవారం రాత్రి జేసీబీలతో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.
ఈ నేపథ్యంలో ‘‘న్యాయం కోసం నినదించడమే తప్పా?. ఇంటిని కాపాడుకోవాలనుకోవడమే నేరమా?. అన్యాయాన్ని పవన్ కల్యాణ్కు చెప్పుకుంటే ఇల్లు కూల్చేస్తారా?. ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ పేదలు ఉండకూడదా?. బాధలు చెప్పుకుంటే వైసీపీ నేతల వేధింపులేంటి?. పేదింటి ఆడబిడ్డను వేధించడానికి చట్టానికి సిగ్గుగా లేదా?. ’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.