మీరే పరిష్కరించుకోండి.. విద్యుత్ సమస్యపై ఏపీ, తెలంగాణకు కేంద్రం సూచన
ABN , First Publish Date - 2021-12-21T23:57:23+05:30 IST
విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో వివాదాలను రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న ..
న్యూఢిల్లీ: విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో వివాదాలను రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉభయులకు సూచించినట్లు రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈ సమాధానం ఇచ్చారు.