అధికారిక లాంఛనాలతో గౌతమ్ అంత్యక్రియలు..రెండు రోజులు సంతాపదినాలు
ABN , First Publish Date - 2022-02-21T16:51:04+05:30 IST
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. సంతాప సూచకంగా జాతీయపతాకాన్ని అవనతం చేయనున్నారు.
కాసేపట్లో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసానికి మంత్రి భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి నివాసానికి భౌతికకాయాన్ని తరలిస్తారు. అమెరికాలో ఉన్న మంత్రి కుమారుడు రేపటికి ఇండియా రానున్నట్లు సమాచారం. బుధవారం నెల్లూరులోనే మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.