ప్రాథమిక పాఠశాలలను హైస్కూల్లో కలపడాన్ని ఖండిస్తున్నాం: Ramakrishna

ABN , First Publish Date - 2022-01-19T17:40:54+05:30 IST

ప్రాథమిక పాఠశాలలను హైస్కూల్లో కలపాలపై విద్యాశాఖ మంత్రి నిర్ణయంపై పురపాలక ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రాథమిక పాఠశాలలను హైస్కూల్లో కలపడాన్ని ఖండిస్తున్నాం: Ramakrishna

అమరావతి: ప్రాథమిక పాఠశాలలను హైస్కూల్లో కలపాలపై విద్యాశాఖ మంత్రి నిర్ణయంపై పురపాలక ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2115 పురపాలక  స్కూల్ ఉన్నాయని... విద్యాశాఖ మంత్రి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని ప్రాథమిక పాఠశాలలను హైస్కూల్లో కలపాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలక పాఠశాలలు కనుమరుగవుతున్నాయని  తెలిపారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్లో కలపడాన్ని ఖండిస్తున్నామన్నారు. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను హై స్కూల్‌లో కలపడం వల్ల 30 పురపాలక స్కూల్స్ మూసివేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పురపాలక వ్యవస్థ చాలా బాగా నడుస్తుందని,  తరగతికి 60, 70 మంది పిల్లలు చేరుతున్నారని తెలిపారు. పురపాలక స్కూల్స్‌ని మూసి వేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దళితులు, బహుజన  పిల్లలకు ఆన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకొని పురపాలక ప్రాథమిక పాఠశాలలను మూసివేయడం ఆపివేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-19T17:40:54+05:30 IST