AP: ఎన్టీఆర్ వర్శిటీ నిధుల మళ్లింపుపై ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2021-11-30T16:50:59+05:30 IST

ఎన్టీఆర్‌ వర్శిటీ నిధుల మళ్లింపుపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

AP: ఎన్టీఆర్ వర్శిటీ నిధుల మళ్లింపుపై ఉద్యోగుల నిరసన

అమరావతి: ఎన్టీఆర్‌ వర్శిటీ నిధుల మళ్లింపుపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ వర్శిటీ రిజిస్ట్రార్‌తో ఉద్యోగ సంఘం నేతలు భేటీ అయ్యారు. రూ.400 కోట్లు వర్శిటీ నిధులు ఏపీ ఫైనాన్స్ సర్వేసెస్ కార్పొరేషన్‌కు తరలింపునకు ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే. బ్యాంక్‌లలో ఉన్న ఎఫ్‌డీల బదలాయింపుకు ఆదేశాలు వచ్చాయి. ఎఫ్‌డీల ద్వారా వచ్చే వడ్డీ కూడా నష్టపోయేలా అధికారుల చర్యలు చేపట్టారు. దీంతో వర్శిటీ పెద్దల నిర్ణయంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆందోళనలు చేసుకుంటే చేసుకోండంటూ ఉద్యోగుల పట్ల వీసీ శ్యామ్ ప్రసాద్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైస్ ఛాన్సలర్ తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-11-30T16:50:59+05:30 IST