ఏపీలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులు.. తాజాగా 10 కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-12-29T23:53:44+05:30 IST

ఏపీలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 10 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఒమైక్రాన్ కేసుల సంఖ్య 16కు చేరింది...

ఏపీలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులు.. తాజాగా 10 కేసులు నమోదు

అమరావతి: ఏపీలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 10 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఒమైక్రాన్ కేసుల సంఖ్య 16కు చేరింది. తూ.గో. 3, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2 కేసులు, గుంటూరు, చిత్తూరు, ప.గో. జిల్లాల్లో ఒక్కో ఒమైక్రాన్ కేసులు చొప్పున తాజాగా నమోదయ్యాయి. కువైట్, నైజీరియా, సౌదీ అరేబియా, అమెరికా, యూఏఈ నుంచి వచ్చినవారికి ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో తొలిసారిగా కాంటాక్ట్ స్ప్రెడింగ్ ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన ఒమైక్రాన్ బాధితుల్లో ముగ్గురు కాంటాక్టులకు ఒమైక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. 

Updated Date - 2021-12-29T23:53:44+05:30 IST