ఏపీలో కొత్త జిల్లాల పేరుతో ఎలాంటి వివాదాలకు తెర తీశారు?

ABN , First Publish Date - 2022-01-28T01:08:25+05:30 IST

పీలో జిల్లాల పునర్వివిభజన చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రంలో..

ఏపీలో కొత్త జిల్లాల పేరుతో ఎలాంటి వివాదాలకు తెర తీశారు?

అమరావతి: ఏపీలో జిల్లాల పునర్వివిభజన చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రంలో మరో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. మొత్తం 26 జిల్లాల ఏపీకి మంత్రుల కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది.  దీంతో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 


అయితే జిల్లాల కేంద్రాలతో పాటు పేర్ల విషయంలోనూ కొన్ని చోట్ల విమర్శలు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల వివాదస్పదమవుతున్నాయి. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై వంగవీటి నరేంద్ర అభ్యంతరం చెబుతున్నారు.ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రతిపక్ష రాజకీయ నేతలు అంటున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘కొత్త వివాదాలకు ఏపీలో కొత్త జిల్లాల పేరుతో ఎలాంటి వివాదాలకు తెర తీశారు?. ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే కుతంత్రం ప్రజలకు అర్ధమైందా?. జిల్లాల ఏర్పాటు ముసుగులో ఏ అంశాలను పక్కదోవ పట్టిస్తున్నారు?. కొడాలి కేసినో ఎపిసోడ్ చర్చ నుంచి డైవర్షన్ పాలిటిక్స్ కాదా?. ఉద్యోగుల సమ్మె నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ కాదా?. విద్యుత్ ఛార్జిల పెంపుపై ప్రజలను ఏమార్చే ప్రయత్నం కాదా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2022-01-28T01:08:25+05:30 IST