AP: పెడన మండలంలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-05T18:05:19+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా పెడన మండలంలో కరోనా కలకలం రేగింది.

AP: పెడన మండలంలో కరోనా కలకలం

విజయవాడ: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా  పెడన మండలంలో కరోనా కలకలం రేగింది. పెడన మండలం నందమూరులో ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరొన పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే పాఠశాలను మూసి వేయాలంటూ  మండల  విద్యాశాఖ అధికారి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయురాలికి కరోనా అని తేలడంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-05T18:05:19+05:30 IST