ఏపీలో అరాచకమే ఎజెండాగా పాలన: దేవినేని
ABN , First Publish Date - 2022-01-04T04:33:07+05:30 IST
ఏపీలో అరాచకమే ఎజెండాగా వైసీపీ పాలన సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. పాలన చేతకాక విగ్రహాలపై ...
విజయవాడ: ఏపీలో అరాచకమే ఎజెండాగా వైసీపీ పాలన సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. పాలన చేతకాక విగ్రహాలపై దాడులకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. పట్టపగలే అధికార పార్టీ నేతలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని చెప్పారు. పెట్రోల్, డీజిల్పై పన్నుల భారం వేసి ఖజానా నింపుకోవాలని చూస్తున్నారని, పెన్షన్లపై జగన్రెడ్డి నిస్సిగ్గుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.