పీఆర్సీ జీవో రద్దు చేయాల్సిందే: ఏపీ ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-23T22:54:37+05:30 IST

రాష్ట్ర పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవోలను ఇచ్చి ఉద్యోగులను..

పీఆర్సీ జీవో రద్దు చేయాల్సిందే: ఏపీ ఉద్యోగులు

గుంటూరు: రాష్ట్ర పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవోలను ఇచ్చి ఉద్యోగులను మోసం చేసిందని ఉద్యోగ సంఘ నేతల ఆరోపిస్తున్నారు. చీకటి జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. హెచ్‎ఆర్ పాత పద్ధతిలోనే ఉద్యోగులకు మంజూరు చేయాలని కోరుతున్నారు. పీఆర్సీకి డీఏ‌కి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. జీతం పెరిగిందని రుజువు చేస్తే కార్యాచరణ ఆపడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. తమకు పాత పీఆర్సీనే అమలు చేసి డీఏలు చెల్లించాలని, పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఉద్యోగులు అందరూ కలిసి పాత పద్ధతిలోనే  11వ పీఆర్సీ అమలు కోసం పోరాడాలని నిర్ణయించారు. అన్ని ఉద్యోగ సంఘాల కలిసి చీకటి జీవోలు రద్దు చేసే వరకు పోరాడతామని ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు. 

Updated Date - 2022-01-23T22:54:37+05:30 IST