ఏపీలో మరో 4 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-04-01T04:00:31+05:30 IST
ఏపీలో మరో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. విశాఖ జిల్లాలో కొత్తగా ఈ నాలుగు కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు..
అమరావతి: ఏపీలో మరో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. విశాఖ జిల్లాలో కొత్తగా ఈ నాలుగు కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ నలుగురు కూడా మర్కజ్ సదస్సులో పాల్గొని విశాఖకు వెళ్లినట్లు గుర్తించారు. విశాఖలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు 10కి చేరినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరినట్లు వెల్లడించారు.