ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..
ABN , First Publish Date - 2020-03-29T03:58:09+05:30 IST
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ కేసుల సంఖ్య 19కి చేరినట్లు వైద్యులు తెలిపారు. మొత్తం 68 మంది రక్ష నమూనాలను ...
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ కేసుల సంఖ్య 19కి చేరినట్లు వైద్యులు తెలిపారు. మొత్తం 68 మంది రక్త నమూనాలను పరీక్షలకు పంపగా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. మరో 65 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఢిల్లీలో మత సంబంధిత సమావేశాలకు వెళ్లొచ్చిన ఇద్దరితో పాటు ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. మక్కా నుంచి వచ్చిన కృష్ణా జిల్లాకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి కూడా పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ఇటీవల రాజస్థాన్ వెళ్లొచ్చిన కర్నూలు జిల్లా నొస్సం గ్రామానికి చెందిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.