ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ దుర్వినియోగం: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-02-19T20:03:30+05:30 IST

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ దుర్వినియోగం: చంద్రబాబు

అమరావతి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు తాను మాట్లాడుతున్నా.. తన మీద కూడా అట్రాసిటీ కేసు పెడతారా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన ఆయన.. ఆంబోతులకు భయం ఉండదు.. దున్నపోతులకు చలనం ఉండదని వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దున్నపోతుల పొగరు దించే శక్తి ప్రజలకే ఉందన్నారు. ప్రజాహితం కోసం పోరాడితే ఆర్థికంగా దెబ్బతీస్తున్నారన్నారు. టీడీపీ నేతలందరికీ సెక్యూరిటీ తీసేశారన్నారు. దోపిడీ చేసుకోవడానికి వైసీపీ దొంగలకు భద్రత పెంచారన్నారు. ధైర్యం ఉంటే తన సెక్యూరిటీని కూడా తగ్గించండన్నారు. తమను ప్రజలే కాపాడుకుంటారని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2020-02-19T20:03:30+05:30 IST