ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ .. My Foundationపై కేసు

ABN , First Publish Date - 2022-05-13T11:40:48+05:30 IST

చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట మోసాలకు పాల్పడుతున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ .. My Foundationపై కేసు

హైదరాబాద్‌ సిటీ : చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట మోసాలకు పాల్పడుతున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వరస కథనాలకు సీసీఎస్‌ పోలీసులు స్పందించారు. మై ఫౌండేషన్‌ సంస్థపై, ఈ దందాతో సంబంధం ఉన్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు.  ట్రస్ట్‌ పేరిట పేద కైస్త్రవులకు ఇళ్లు, పాస్టర్‌లకు విల్లాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అంటూ ప్రచారం చేసి ముందస్తుగా డబ్బులు వసూలు చేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సీసీఎ్‌సను ఆశ్రయించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more