ఆంధ్ర సారస్వత పరిషత్ సేవలు అభినందనీయం
ABN , First Publish Date - 2021-12-07T05:57:07+05:30 IST
ఆం ధ్ర సారస్వత పరిషత్ తెలుగు భాషా వికాసానికి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధాని మోదీ తీసుకువస్తున్న నూతన విద్యా విధానం వల్ల మాతృభాషలకు స్వర్ణయుగం రానున్నదని హరియా ణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారని గజల్ శ్రీనివాస్ అన్నారు.
భీమవరం, డిసెంబరు 6 : ఆం ధ్ర సారస్వత పరిషత్ తెలుగు భాషా వికాసానికి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధాని మోదీ తీసుకువస్తున్న నూతన విద్యా విధానం వల్ల మాతృభాషలకు స్వర్ణయుగం రానున్నదని హరియా ణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారని గజల్ శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనవరి 7,8 తేదీలలో భీమవరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబంరాలలో పాల్గొంటానని గవర్నర్ తెలిపారన్నారు. దత్తాత్రేయను ఆహ్వానించిన వారిలో సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వల్లూరి జయప్రకాష్ ఉన్నారు.