ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు...

ABN , First Publish Date - 2020-10-25T11:39:58+05:30 IST

నైరుతి బంగాళాఖాతంలో 1.5-3.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉభయ గోదావరి, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు

ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు...

అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో 1.5-3.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉభయ గోదావరి, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా, 48 గంటల్లో  నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి. అలాగే, ఈశాన్య రుతుపవనాలు ఈనెల 28న దేశంలోకి ప్రవేశించనున్నాయి. ఈశాన్య రుతుపవనాల వర్షాలు కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరిలతోపాటు కర్ణాటక, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఈనెల 28 నుంచే ప్రారంభం కానున్నట్టు భారత వాతావరణశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. కాగా, మొత్తం ఈశాన్య భారతంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. బాఘ్‌పట్‌, పానిపట్‌, ఘజియాబాద్‌, బల్లబ్‌గఢ్‌, ఫరీదాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఉదయం పొగమంచులా కమ్మేసింది.

Updated Date - 2020-10-25T11:39:58+05:30 IST