Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న పారిశుద్ద్య కార్మికుల సమ్మె

ABN , First Publish Date - 2022-07-15T00:24:26+05:30 IST

ఏపీలో పారిశుద్ద్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమింపజేసేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.

Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న పారిశుద్ద్య కార్మికుల సమ్మె

అమరావతి: ఏపీలో పారిశుద్ద్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమింపజేసేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. పారిశుద్ద్య కార్మికుల సమ్మెపై మంత్రులు కమిటీ భేటీ అయింది. డిమాండ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చినట్లు చెబుతున్నారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మె గురువారానికి నాలుగో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు నిన్న ప్రదర్శనలు, ధర్నాలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. కార్మికుల సమ్మెతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా పడింది. చెత్త కుప్పల్లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. అసలే వర్షాలు.. ఆపై సమ్మెతో లోపించిన పారిశుధ్యం.. ఈ పరిస్థితుల్లో రోగాలు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్మిక సంఘాలు చేసిన 22 డిమాండ్లలో 21 పరిష్కరించామని, జీతాల సమస్యపై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారని, సమ్మె విరమించి విధుల్లో చేరితే చర్చలు జరుపుతామని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బేషజాలకు పోకుండా చర్చలు జరిపి సమ్మెకు పరిష్కారం చూపాలని పారిశుద్ద్య కార్మికుల డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-07-15T00:24:26+05:30 IST