AP News: కర్ణాటక మద్యం, నాటు సారా పంపిణీ చేసిన వైసీపీ నాయకులు
ABN , First Publish Date - 2022-09-30T18:18:49+05:30 IST
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నంద్యాల పర్యటనలో మద్యం (Liquor) ఏరులై పారింది.
నంద్యాల (Nandyala): ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) నంద్యాల పర్యటనలో మద్యం (Liquor) ఏరులై పారింది. వెంకటనాయిని పల్లెకు చెందిన ఓ పార్టీ నాయకుడు.. అతని అనుచరులు వైసీపీ (YCP)లో చేరుతుండడంతో డోన్లో మంత్రి బుగ్గన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి వచ్చిన జనానికి వైసీపీ నాయకులు ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద కర్ణాటక మద్యం (Karnataka Liquor), నాటు సారా (Natu Sara) పంపిణీ చేశారు. బహిరంగంగానే మద్యం పంపిణి చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే కర్నాటక మద్యం టెట్రా ప్యాకెట్లను వాహనాల్లో తీసుకువచ్చి కార్యకర్తలకు పంపిణీ చేశారు. మద్యం కోసం జనాలు ఎగబడ్డారు. నిషేధిత జాబితాలో ఉన్న మద్యాన్ని పంపిణీ చేశారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. బహిరంగంగా మద్యం, నాటుసారా పంపిణీ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.