అమరావతి: విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-02-02T20:39:52+05:30 IST

ఏపీలో విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.

అమరావతి: విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు

అమరావతి: జగన్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగులలో విద్యుత్ ఉద్యోగులు వేరయా అంటోంది. విద్యుత్ ఉద్యోగుల కోసం ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగుల వేతన కమిషన్ వేసింది. వేతన సవరణ కమిషన్ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్‌ను నియమించింది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులను సవరించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్ కోరింది.

Updated Date - 2022-02-02T20:39:52+05:30 IST